ఆర్కేపురం, ఏప్రిల్ 12: సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే ఈ రద్దీలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు రైతుబజార్ దిగువ భాగాన గల కాలనీ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వావానాలను రైతుబజార్ పార్కింగ్లో నిలిపితే రూ.5 చెల్లించాల్సి వస్తుందని జాతీయ రహదారి పక్కన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రధానంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1,2గంటల వరకు ఈ మార్గం ప్రతినిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తుందని, అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు తెలిపారు. ఎవరైనా నిబందనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చలాన్ రాస్తున్నట్లు పేర్కొన్నారు. షాపింగ్ కోసం వచ్చే ప్రజలు తమ వాహనాలను సర్వీస్ రోడ్డు, ఫుట్పాత్లపై పార్కింగ్ చేయవద్దని సూచించారు.