Hyderabad | హైదరాబాద్ : ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లే వారు బయటకు రావడంతో.. ట్యాంక్ బండ్, లిబర్టీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరిగింది. దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు సచివాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పైకి వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించడం లేదు. గణనాథులను నెక్లెస్ రోడ్డు, ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తున్నారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం గణేశ్ నిమజ్జనం పూర్తి చేశాం. గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు. వాహనాల రద్దీ పెరగడంతో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పైకి వాహనాలను అనుమతిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో దంచికొట్టిన వానలు.. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షపాతం నమోదు
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్