Hyderabad | హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ మీసేవ రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఫుట్పాత్పై ఉన్న టిఫిన్, చికెన్ పకోడి, జ్యూస్ సెంటర్ డబ్బాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు.
మీసేవ రోడ్డులో గత కొన్నేళ్లుగా చిరువ్యాపారులు దందా చేసుకుంటున్నారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు శనివారం ఉదయం ఆక్రమణలను తొలగించారు. కాగా, పొట్టకూటి కోసం రోడ్డుపై వ్యాపారాలు చేసుకుంటున్న తమపై జులుం చేయడమేంటని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
