సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు బుధవారం సాయంత్రం కురిసిన వానతో కొంత ఉపశమనం పొందారు. ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు టోలీచౌకిలో అత్యధికంగా 2.5సెం.మీలు, బంజారాహిల్స్లో 1.9సెం.మీలు, గోల్కొండలో 1.8సెం.మీలు, రాజేంద్రనగర్లో 1.5సెం.మీలు, ఆసిఫ్నగర్లో 1.2, అమీర్పేటలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.