హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 జరుగనున్న ఈ సమావేశానికి రెండు వేల మందితో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, తదితర పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక కమాండ్ కంట్రోల్తో పాటు దాదాపు 300 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటుచేశారు. అక్టోపస్, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ల తనిఖీలతో పాటు డ్రోన్ పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే వారికి కేటాయించిన పాసుల ఆధారంగానే అనుమతి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.