Harish Rao | ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కూల్చేసినప్పుడు బాధితులు గుండెలవిసేలా రోదిస్తే, అక్కడికి బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారని అన్నారు.
మహాభారతంలో కర్ణుడి లాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను.. అది కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చక పోవచ్చు అని ఓ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై హరీష్ రావు తనదైన స్టైల్లో చురకలంటించారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా.. క్రూరుడు. ఖమ్మంలో బాధితులు ఏడుస్తూంటే పాపం ఎస్ఐ కండ్లళ్ల నీళ్లు పెట్టుకున్నడు. అక్కడికి పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతుంటే గుండెలవిసి పోయేలా అక్కాచెల్లెళ్లు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కండ్లలో కూడా నీళ్లు ఆగలేదు.
రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది.. ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డరు. ఆ ఎస్ఐకి కండ్లళ్ల నీళ్లొచ్చినయ్.. ఆ వీడియోలు చూసి మనందరం కూడా బాధపడ్డం కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి.. నువ్వు కర్ణుడివి కాదు.. క్రూరుడివి..కర్ణుడికి నీకు పోలికే లేదు. కర్ణుడు మాట మీద నిలబడ్తడు. గుండెలను చీల్చి కవచ కుండలాలను ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే.. గుండెల మీద తన్నినోడు ఈ రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు క్రూరుడు
ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసినప్పుడు బాధితులు గుండెలవిసేలా రోదిస్తే, అక్కడికి బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారు
ఖమ్మం బాధితుల వీడియోలు చూసి రాష్ట్రమంతా బాధపడ్డది కానీ వీసమెత్తు బాధ పడని క్రూరుడు రేవంత్ రెడ్డి
గుండెలు… https://t.co/2PV69anYJV pic.twitter.com/rzlQCjdP2R
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026