సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగంరలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2డిగ్రీలు, గాలిలో తేమ 29శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.