బడంగ్పేట, అక్టోబర్ 19 : మహేశ్వరం నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ కావడం ఖాయమని విద్యాశాఖ మంత్రి పీ. సబితాఇంద్రారెడ్డి జోష్యం చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్కు చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, ఇందుకు ప్రజల దీవెనలు ఉండాలన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శం అన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజల కష్టాలు తీర్చుతున్న పార్టీలను గుర్తుంచుకోవాలని, మతం, కులం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉన్నదో ప్రజలు గమనించి ఓటు వేయాలని ఆమె సూచించారు. అనంతరం పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, కార్పొరేటర్లు భూపాల్రెడ్డి, గౌరీ శంకర్, గజ్జల రాంచందర్, బాలమణి, అనిల్ కుమార్, జల్పల్లి మాజీ సర్పంచ్ సూరెడ్డి క్రిష్ణారెడ్డి, అర్జున్, జనార్దన్, దూడల శ్రీనివాస్, సియర్ నాయకులు సత్తిరెడ్డి, నాగేశ్ ముదిరాజ్, గోపాల్రెడ్డి, రవి, దిండు భూపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.