అమీర్పేట్, ఆగస్టు 7: ఎస్ఆర్నగర్ బాపూనగర్లోని జీ స్వామినాయక్ భవన్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానలో వైద్యులు అందుబాటులో లేరు. దాదాపు 2వేలకు పైగా జనాభా ఉన్న ఈ బస్తీలో ప్రతిరోజూ కనీసం 50 మంది వరకు వైద్య అవసరాల నిమిత్తం బస్తీ దవాఖానకు వస్తుంటారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ నర్సులు, అటెండర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు. ఈ విషయమై బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిసింగ్జాదవ్.. ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. డీఎంహెచ్వోకు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించడంతో పాటు తక్షణమే బాపూనగర్ బస్తీ దవాఖానకు మెడికల్ ఆఫీసర్ను నియమించాలని లేఖ రాశారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో బీఆర్ఎస్ నేతలు.. లలితా ఓపీలాల్ చౌహాన్, పీయూష్ గుప్తా, గులాబ్సింగ్ రాజ్పురోహిత్ తదితరులు ఉన్నారు.