అల్లాపూర్, అక్టోబర్ 27: పనిచేస్తున్న సంస్థకు స్నేహితుడితో కలిసి కన్నం వేసి.. నగదు ఎత్తుకెళ్లిన ఇద్దురిని అల్లాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి ఏసీపీ పి.శివభాస్కర్, అల్లాపూర్ ఇస్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం… సూర్యవంశీకుమార్ సంతోష్కుమార్ (34) సాయి చైతన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. బోరబండకు చెందిన ఇసాక్ అహ్మద్(27) కారు డ్రైవర్. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు.
తాను పనిచేసే స్కూల్లో చాలా డబ్బులు ఉంటాయని సూర్యవంశీ ఇటీవల ఇసాక్తో చెప్పాడు. దసరా సెలవుల్లో స్కూల్లో ఎవరూ ఉండరని, ఆ సమయంలో డబ్బు దొంగలించాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. పథకం ప్రకారం.. ఈనెల 17వ తేదీ తెల్లవారుజాము 3గంటల సమయంలో ఇసాక్ సాయి చైతన్య స్కూల్లోకి చొరబడి.. ఆఫీసు రూమ్ తలుపులకు ఉన్న సెంట్రల్ లాక్ను పగులగొట్టాడు. రూ.11,50,000 లక్షలు నగదును తస్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తుండగా బాలానగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సాయి చైతన్య స్కూల్లో తన స్నేహితుడితో కలిసి దొంగతనం చేసినట్టు ఇసాక్ ఒప్పుకున్నాడు. దీంతో మరో నిందితుడు సూర్యవంశీని కూడా అరెస్టు చేసిన పోలీసులు, నిందితుల నుంచి రూ.8,00,160 లక్షల నగదు, రెండు ఫోన్లు, రెండు టైటాన్ గడియారాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.