నాంపల్లి కోర్టులు, అగస్టు 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి గురువారం ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని కించపరిచేలా తిట్టడం అప్రజాస్వామికమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల నిర్వహణకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న ఎంపీ అర్వింద్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తులకు పోటీ చేసే అర్హత లేదన్నారు. ఎంపీ అర్వింద్ చేసిన అసభ్యకర పదజాలానికి సంబంధించిన విడియోను అందించామని వారు తెలిపారు.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్లకు స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరముందన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జి.కిరణ్కుమార్, నరేందర్, లక్ష్మణ్, సోమ భరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.