సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రధానంగా నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తమ కార్యాలయాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా అలకరించుకున్నారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. చార్మినార్, మొజాంజాహీ మారెట్, కాచిగూడ, రైల్వేస్టేషన్లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్ట్, బీఆరేఆర్ భవనం, జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయ భవనాలపై చేసిన విద్యుత్దీపాల అలంకరణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆర్కేపురం, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు వరకు గురువారం ఫ్రీడం రన్ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు దయానంద్గుప్త, యెగ్గె మల్లేశం, కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ తదితరులు జాతీయ జెండాను పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
బంజారాహిల్స్, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద ఫ్రీడమ్ రన్ కనులపండువగా నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కమాండ్ కంట్రోల్ నుంచి కేబీఆర్ పార్కుదాకా కొనసాగిన 5కే రన్ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్తో పాటు వందలాది మంది పోలీసులు, విద్యార్థులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్కు ముందు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులతో పాటు పోలీసు అధికారులు డీజే టిల్లు పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.
సుల్తాన్బజార్, ఆగస్టు 11: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భారీ తిరంగా పతాక ర్యాలీని గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు ప్రారంభించారు. 200 మీటర్ల పొడవున్న తిరంగా పతాకాన్ని 2వేల మంది ఉద్యోగులు చేతబూని టీఎన్జీవో జిల్లా శాఖ కార్యాలయం నుంచి గన్ పార్కు అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీగా వెళ్లి జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ర్యాలీ ఆసాంతం జై తెలంగాణ, జై భారత్ నినాదాలు మిన్నంటాయి. ఈ కార్య క్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, జిల్లా శాఖ కార్యదర్శి ఎస్. విక్రమ్కుమార్, కోశాధికారి జే. బాలరాజ్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్కుమార్, ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, కార్యాలయ కార్యదర్శి ఎస్ మురళీరాజ్, సభ్యులు వైదిక్ శస్త్ర, శంకర్, ముఖీం ఖురేషి, మాజీ కార్యదర్శులు ప్రభాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించిన నటుడు నిఖిల్ సిద్దార్థ్
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) / మాదాపూర్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఐటీ జోన్లో 4 కే రన్ ఉత్సాహంగా సాగింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ హైటెక్స్ కమాన్ వద్ద జీహెచ్ఎంసీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం 4 కే రన్ను ప్రముఖ నటుడు నిఖిల్ సిద్ధార్థ, జోనల్ కమిషనర్ శంకరయ్య, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి డీసీలు నందగిరి సుధాంశ్, వెంకన్న ప్రారంభించారు. గూగుల్, హెచ్ఎస్బీసీ, లెమెన్ ట్రీ, అండర్ పాస్, ఐకియా మీదుగా బయో డైవర్సిటీ వరకు కొనసాగింది. వివిధ కంపెనీల ఉద్యోగులు, యువతీ యువకులు సుమారు 650 మంది వరకు ఈ రన్లో భాగస్వాములయ్యారు. రన్లో పాల్గొన్న వారికి బయోడైవర్సిటీ పార్కులో ప్రత్యేక మెడల్స్, టీ షర్టులను అందించారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వెంగళరావునగర్, ఆగస్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ నుంచి కళ్యాణ్నగర్ చౌరస్తా వరకు ఫ్రీడం రన్ నిర్వహించారు. ర్యాలీలో చిన్నారులు త్రివర్ణ పతాకాలు చేతబట్టి దేశభక్తి గేయాలను ఆలపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జై జవాన్, జైకిసాన్ అంటూ నినాదాలు చేశారు.
సికింద్రాబాద్, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నాంపల్లిలోని అబ్కారీ భవన్లో ఉద్యోగులకు జాతీయ పతాకాలను పంపిణీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, చిత్రంలో ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎక్సైజ్ కమిషనర్ అజయ్ రావు, సంయుక్త ఆబ్కారీ కమిషనర్లు కురేషి, శాస్త్రి, సహాయక కమిషనర్లు చంద్రయ్య, శ్రీనివాస్, తదితరులు
బైక్ యాత్ర చేపట్టిన నగరవాసి రాకేశ్
చార్మినార్, ఆగస్ట్ 11 : దేశ సమైక్యత కోసం చార్మినార్ నుంచి కశ్మీర్ వరకు బైక్ యాత్ర నిర్వహిస్తున్నట్లు పూస రాకేశ్ తెలిపారు. షేక్పేట్ ప్రాంతానికి చెందిన రాకేశ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2500 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రతి నగరంలో సమైక్య నినాదాన్ని చాటి చెప్పనున్నట్లు తెలిపారు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు నగరానికి చెందిన సోదరీమణుల రాఖీలను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు వందేభారత్ సేవాదళ్ సభ్యులు, ఔత్సాహికులు పాల్గొన్నారు.
మేయర్ విజయలక్ష్మి పిలుపు
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. వాణిజ్య సముదాలు, షాపుల యాజమానులు జాతీయ జెండా, విద్యుత్ దీపాల అలంకరణ చేయాలన్నారు. ఈ మేరకు తమ పరిధిలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు వారితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు.
నేడు జాతీయ సమాఖ్య రక్షాబంధన్
త్రివర్ణ పతాకం గల రాఖీలు వినియోగించి జాతీయ సమైక్యతకు పాటు పడాలని శుక్రవారం జాతీయ సమాఖ్య రక్షాబంధన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నారు. ఈ విషయంలో శాటిలైట్, లోకల్ చానెళ్లలో దేశభక్తి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.