బోడుప్పల్, ఏప్రిల్22: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా చెరువు’ అభివృద్ధి, సుందరీకరణకు పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. రా చెరువు అభివృద్ధిపై మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే చెరువు ఎగువ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలుషిత జలాలు చెరువులోకి చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. చర్లపల్లి, మల్లాపూర్ పారిశ్రామిక వాడల నుంచి దిగువకు వెలువడే వ్యర్థ్ధ,కలుషిత నీరును చెరువులోకి చేరకుండా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారు.బాక్స్ డ్రైన్ ద్వారా కలుషిత జలాలను నేరుగా మూసీలోకి మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో రా చెరువు నాలా పరివాహక ప్రాంతాలైన మల్లయ్యనగర్, అనుశ్రీనగర్,వాసవీనగర్ కాలనీ, జ్యోతినగర్ కాలనీ, శ్రీనివాస్నగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సాయిభవానీనగర్ కాల నీ, ద్వారకానగర్,ద్వారకానగర్ ఫేస్-2, ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీ కాలనీలకు దుర్వాసన నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.
‘రా చెరువు’ సుందరీకరణకు ప్రభుత్వం, పా లకవర్గం కట్టుబడి ఉం ది. ఇందుకు మూ డేండ్లలో రూ. 12.75కోట్ల నిధులు కేటాయించి పనులను యుద్ధ ప్రాతిపదికనపూర్తిచేస్తున్నాం. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. నాలా మళ్లింపునకు భూసేకరణలో రెవెన్యూ సమస్యలు తలెత్తడంతో ద్వారకానగర్ కాలనీతో పాటు అక్కడక్కడా బాక్స్డ్రైన్ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. త్వరలో అన్ని సమస్యలను అధిగమిస్తాం. నాలా పరిసరాల్లో ఉన్న సుమారు 15కాలనీలకు ఉపశమనం కలింగించేలా చర్యలు తీసుకుంటాం.
-బుచ్చిరెడ్డి,మేయర్ బోడుప్పల్ కార్పొరేషన్