అబిడ్స్, మార్చి 4: ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడువు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో వేలాది మంది ట్రేడ్ లైసెన్స్లు ఉండగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు 2000 వరకు లైసెన్స్లు మాత్రమే రెన్యువల్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు తమ ట్రేడ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగాను చర్యలు తీసుకుంటున్నారు. మార్చి ఒకటవ తేదీ ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్కు ఈ నెల 31వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా రెన్యువల్ చేస్తారు. గడువు తేదీలోపు ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకోని వారికి 25 శాతం అపరాధ రుసుమును విధించేందుకుగాను అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అది కూ డా ఏప్రిల్ 30వ తేదీ లోపు మాత్రమే అవకాశం ఉంటుంది.
జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో మొత్తం 19,415 ట్రేడ్ లైసెన్స్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 2,000 వరకు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. మాత్రమే ట్రేడ్ లైసెన్స్లు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. భారీ మొత్తంలో లైసెన్స్లు రెన్యువల్ కావాల్సి ఉండడంతో వాటన్నింటిని రెన్యువల్ చేయించేందుకుగాను అధికారులు చర్య లు చేపడుతున్నారు. ఈ ట్రేడ్ లైసెన్స్ల ద్వారా జీహెచ్ఎంసీకి కోట్లాది రూపాయల రెవెన్యూ అందాల్సి ఉండగా వ్యాపారులు ముందు కు రాకపోవడంతో అధికారులు అన్ని ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకుగాను పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డీడీ నాయక్, ఎఎంఓహెచ్లతో పాటు ఇతర అధికారులు ట్రేడ్ లైసెన్స్లు కలిగి ఉండి రెన్యువల్ చేసుకోని వారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో వేలాది ట్రేడ్ లైసెన్స్లు ఉండగా అందులో వందలాది లైసెన్స్లు కూడా రెన్యువల్ కాకపోవడంతో అధికారులు ఎంత మందకొండిగా పనిచేస్తున్నారోనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకుగాను అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. గడువు తేదీ లోపు లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవాలని విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ వ్యాపారుల నుంచి ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదంటే వ్యాపారులు సైతం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు అపరాధ రుసు ము విధించి అన్ని ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునే లా చేసి జీహెచ్ఎంసీకి ఆదాయం పెంచేందుకుగాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.