మల్కాజిగిరి/ నేరేడ్మెట్, అక్టోబర్ 2: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందుతాయని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఇన్చార్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నగరంలో ప్రజలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీమేరకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు.
గతంలో కరెంటు కష్టాలు ఉండేవని, విద్యుత్ కోతలతో పరిశ్రమలకు విద్యుత్ హాలీడేలు ఇచ్చేవారని అన్నా. దీంతో కార్మికులు ఉపాధి దొరకక పస్తులు పడుకున్న సంఘటనలు ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిచేందాలంటే విద్యుత్ సరఫరా ముఖ్యమని గుర్తించి నిరంతం విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. మల్కాజిగిరి ప్రజలకు భరోసా ఇస్తున్నామని, ఎవరికీ బయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ కారు గుర్తుకు ప్రజలు ఓటు వేశారని, ఎవరికి వ్యక్తిగతంగా ఓట్లు పడవని అన్నారు.
ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయని, దుండిగల్లోని అరుంధతి దవాఖానలో ఉచితంగా చికిత్సలు అందజేస్తున్నాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపనులను చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అందరినీ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, అనిల్కిశోర్, నంది నర్మలరెడ్డి, శోభన్, మహాదేవి, శ్రవన్గౌడ్, పూదారి రాజేష్కన్న, రాజేందర్, మోసిన్, చంద్రశేఖర్, ఢిల్లీ పరమేశ్, బీఎన్ రాజు, మల్లేశ్, జామ మహేందర్, కే రాజు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ఖాయం ..
తెలంగాణలో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న సీఎం కేసీఆర్ మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మర్రి రాజశేఖర్రెడ్డి అన్నా రు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు.
అంతేకాకుండా అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సేవలను అందించడానికి నేను ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ప్రజలకు తెలయజేశారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా 24 గంటలు అందిస్తున్నామని, అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నామని ఈ సేవలను వినియోగించుకోవడంమే కాకుండా ఇతరులకు కూడా తెలయజేయాలని కోరారు.
వినాయకుడిని సందర్శించిన రాజశేఖర్రెడ్డి..
నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి సందర్శించారు. అనంతరం బీఆర్ఎస్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, మైఖేల్, అల్బర్ట్, శివ, శ్రీనివాస్రావు, రాజేశ్, సాయిగౌడ్, రవీందర్ , రమేశ్, దీన్దయాళ్, కరుణాకర్, నరేశ్, ఉత్తమ్రెడ్డి, రోహిత్, రాజ్, మోహిత్, రవి, బంటు తదితరులు పాల్గొన్నారు.