సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40డిగ్రీలు దాటి నమోదయ్యాయి. దీంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపించింది. ఈనెల 21న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 43డిగ్రీలు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఆదివారం మరోసారి పెరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.8డిగ్రీలు, గాలిలో తేమ గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.