సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి.. అందరినీ కడుపులోపెట్టుకొని చూసుకుంటున్నారు. దివ్యాంగులకు మరింత చేయూతనందించడానికి దేశంలో ఎక్కడాలేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపారు. ఆయా జిల్లా కేంద్రాల్లో దివ్యాంగులకు, బీడీ టేకేదారులకు పెన్షన్ పెంపు ప్రొసీడింగ్ పత్రాలు, చెక్కులను మంత్రులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని దివ్యాంగులకు ఇంత పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్కడ చేయనోళ్లు ఇక్కడ నీతులు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా కేవలం రూ.950 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. త్వరలోనే ఆసరా పెన్షన్ల చెల్లింపు మొత్తాన్ని కూడా పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారని, లబ్ధిదారులు త్వరలో తీపి కబురు వినే అవకాశం ఉందన్నారు. సకల జనుల ఆరాధ్యుడని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ గెలిచి రావాలి.. మనస్సు గళ్ల సర్కారు అంటూ దీవించారు.