బేగంపేట్, జనవరి 12 : రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాలను సికింద్రాబాద్ బోట్స్ క్లబ్లోని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ముఖ్యఅతిథిగా హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యశాచి ఘోష్, సంచాలకుడు డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.