బేగంపేట్ నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం రాత్రి బేగంపేట్ డివిజన్ పీజీ రోడ్డులో ఉన్న సిల్వర్ జూబ్లీ అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ దివాలి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా నిలిపారని వివరించారు.
విజన్ కలిగిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండటం వలన సాధ్యమైందని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా వృద్ధులు దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్, షాదిముబారక్ క్రింద పేదింటి ఆడపడుచుల పెం డ్లికి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ నగరంలో ైప్లెఓవర్ల నిర్మాణం, అండర్పాస్ల ఏర్పాటు రోడ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ప్రధాన నగరాలలో హైదరాబాద్ ఒకటిగ నిలిచిందన్నా రు.
అదే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు, వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు జరిగి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో కూడా 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మరింత అభివృద్ధి కోసం ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బేగంపేట్ కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు శ్రీహరి పాల్గొన్నారు.
తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని కేవలం ఎన్నికల సమయంలో మా త్రమే వచ్చే నాయకుడిని కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేట్ డివిజన్లోని సింధి కాలనీలో ఉన్న సింధి భవన్ సింధి సత్సంగ్ దర్బార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. గతంలో ఇక్కడ గెలిచిన వారు ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే వారు కాద ని అన్నారు. తాను మాత్రం నిత్యం ప్రజలతోనే ఉం టాన ని విషయం అందరికీ తెలుసనన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. పీజీ రోడ్డు, మినిష్టర్ రోడ్లను తాను వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. పీజీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రోచా భాయ్, సంజయ్, నవీన్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం బేగంపేట్ డివిజన్లోని దేవుడి బస్తీ, తబేలా,వికార్నగర్,భగవంతాపూర్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడునా బస్తీ వాసులు ఆయనకు నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, నాయకులు శ్రీహరి, అఖిల్ హమ్మద్, నరేందర్రావు, శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్, సురేశ్యాదవ్ పాల్గొన్నారు.