ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
అమర వీరుల స్థూపం ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జోన్బృందం,జూన్2: సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటంతోనే రాష్ట్రం సాకారమైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్ట పై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, ఏనుగుల అనిల్ కుమార్, కమిషనర్ నగేశ్వర్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కామేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.