మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సుల్తాన్బజార్,మార్చి 17: ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం ఆస్పత్రిలోని పలు విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పరిచేందుకు గాను రూ.10 కోట్ల 14 లక్షల 67 వేల 437లు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి రూ.ఆరు కోట్ల ఆరోగ్యశ్రీకి, రూ. 4 కోట్ల 14 లక్షల 67 వేల 437లు దవాఖానను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వినియోగిస్తామని దవాఖాన సూపరింటెండెంట్ బి. నాగేందర్ తెలిపారు. రూ.10 కోట్ల 14 లక్షల 67 వేల 437లు ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి గాను నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హెచ్డీఎస్ చైర్మన్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.