ఖైరతాబాద్, మే 26: ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు, పాలు, బాలామృతం, ఐరన్ మాత్రలు అందుతున్నాయా.. అని నేరుగా లబ్ధిదారులను అడగ్గా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
వారంలో ఒక్కసారైనా సంబంధిత అధికారులు అంగన్వాడీ స్కూల్ను సందర్శించాలని సూచించారు. అంగన్వాడీ స్కూళ్లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సేవలు ప్రతి మహిళకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన స్కూల్ రిజిస్టర్ను పరిశీలించారు.