హైదరాబాద్ : వానాకాలం ప్రవేశించిన నేపథ్యంలో వరదనీటి ప్రవాహం సజావుగా పారేలా జీహెచ్ఎంసీ చేపట్టిన మురుగునీటి కాలువల మరమ్మత్తు పనులను నగర మేయర్ జి. విజయలక్ష్మి, మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగునీటి, వరద కాలువల పూడికతీత, వెడల్పు, మరమ్మతులకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.45 కోట్లు కేటాయించింది. ఈ పనులు సమర్ధవంతంగా, సమయానుకూలంగా జరిగేలా మంత్రి తలసాని బేగంపేటలోని వరద నీటి కాలువను పరిశీలించి, పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను అదేశించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్లో ఉన్న కాలువలను మేయర్ విజయ లక్ష్మి పరిశీలించారు. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాలాలను పరిశీలిస్తున్నట్లు మేయర్ ఈ సందర్భంగా తెలిపారు.