హైదరాబాద్: అంబర్పేటలోని ఒక ప్రైవేట్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ కాలేజికి చెందిన నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. సదరు విద్యార్థికి టీసీ ఇవ్వకుండా కాలేజీ ప్రిన్సిపాల్ చాలా ఇబ్బంది పెడుతున్నాడని, అందుకే అతను ఇలా చేశాడని నారాయణ స్వామి స్నేహితులు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే కాలేజీకి వచ్చిన సదరు నారాయణ.. టీసీ గురించి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ఎదురుగానే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతనితోపాటు రక్షించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరు విద్యార్థులకు కూడా కాలిన గాయాలైనట్లు సమాచారం.