చిక్కడపల్లి,జూన్13: మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమించాలి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వి.పి.సాను పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లినరీ సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కాషాయం చేస్తున్నారని ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలో 5వ తరగతి పాఠ్య పుస్తకాలలో భగత్ సింగ్ చరిత్రను తొలగించి హెడ్గేవర్, వి.డి. సావర్కర్ లాంటి దేశ ద్రోహుల పాఠాలను పెట్టారని మండిపడ్డారు. కార్పొరేటర్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష,కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, నాగరాజు పాల్గొన్నారు.