హైదరాబాద్ : ఉన్నత విద్యా చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక రుణం ఇప్పించిన రాష్ట్ర పంచా యతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓ విద్యార్థిని లండన్ వెళుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. జన గామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం నర్సింగాపురానికి చెందిన సపతి భార్గవి అనే విద్యార్థి ని విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడానికి పడుతున్న ఇబ్బందులను మంత్రి తెలుసుకున్నా రు. ఆమెను పిలిపించి వివరాలను తెలుసుకుని వరంగల్ డీసీసీబీ నుంచి రూ.15. 50 లక్షలు రుణంగా ఇప్పిం చడానికి సహాయపడ్డారు.
దీంతో రుణం మంజూరై లండన్ కు బయలు దేరే ముందు ఆర్థిక రుణానికి సహాయ పడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని భార్గవి కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భార్గవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.