HCU Student | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన మయాంక్ కుందు హెచ్సీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మయాంక్ నందు హెచ్సీయూలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మయాంక్ కుందు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మయాంక్ కుందు సెంట్రల్ యూనివర్సిటీలో గతంలో 2 ల్యాప్ టాప్లు దొంగిలించాడని ఆరోపణలున్నాయి. అయితే నేడు మరొక ల్యాప్టాప్ పోవడంతో తనను దొంగ అని ముద్ర వేస్తున్నారని మనస్థాపానికి లోనైన మయాంక్ కుందు యూనివర్సిటీ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.