హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఫిల్మ్నగర్కు చెందిన చింటూను రోహన్ అనే విద్యార్థి బైక్పై రాజేంద్రనగర్ తీసుకెళ్లాడు. మూసీ నది (Musi river) వద్ద తన మిత్రులతో కలిసి చింటూపై కత్తితో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన చింటూకి రక్తం కారుతుండగానే రోహన్ సెల్ఫీ దిగాడు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు బాధితుడిని దవాఖానకు తరలించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసి దానిని బంజారాహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.