మహేశ్వరం, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్ ఒక విజన్తో రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్పల్లికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు 125 మంది గ్రామ సర్పంచ్ ముక్కెర యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. రానున్న 3 నెలలు పార్టీకోసం, నా కోసం పని చేస్తే ఆ తర్వాత 5 సంవత్సరాలు మీకోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతు తెలిపి, మహేశ్వరం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు మైసమ్మ, రజిత, నాయకులు సామయ్య, కుమార్, సుదర్శన్, శంకరయ్య, బాల్రాజ్, ప్రభాకర్, నర్సింహ, యాదయ్య, వెంకటేశ్, నారాయణ, సురేశ్, కుమార్, శంకరమ్మ, గణేశ్, అమృత ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బుసగల్ల జంగయ్య, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.