హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీఆర్ఎస్వీ నాయకులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతిని ఆశించి ఒక నిర్మాణాత్మక రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత కాలం సజీవంగా ఉంటారని వారు పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నెమ్మాది శ్రావణ్ కుమార్ టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ