అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు విషయం విస్మరించిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 24న ‘హలో కార్మిక.. చలో సెక్రటేరియెట్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రేవంత్ సర్కార్ మోసాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను పోస్టర్గా చేసి సోషల్ మీడియా ఉద్యమానికి తెరలేపారు. ఆర్టీసీలో కార్మికులపై అధిక పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతీ నెల రూ.350 కోట్లు కోత విధించకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం 24 మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ధర్నా ప్రారంభమవుతుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.