దామెర, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు విశిష్ట సేవలు అందుతున్నాయి. ఏ రోగమొచ్చినా ఇక్కడికి వస్తే పరీక్షలు చేసి మందులు ఇస్తే ఇట్టే నయమవుతుందని అంటున్నారు గ్రామాల ప్రజలు. 1984 సంవత్సరంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఈ దవాఖానను ప్రారంభించారు. ఆరు పడకల దవాఖానగా ప్రారంభమైన నాటి నుంచి గర్భిణులకు సుఖ ప్రసవాలు చేయడం, చిన్నారులకు టీకాలు వేస్తూ, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులతోపాటు జ్వరం బారిన పడిన వారికి కూడా కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో రోజురోజుకూ ఈ దవాఖానపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. టీబీ, లెప్రసీ బాధితులను గుర్తించి సరైన మందులు ఇస్తున్నారు.
వైద్యురాలు శిరీష ప్రతిరోజూ ఓపీలో రోగులను పరిశీలిస్తూ అందుకు తగ్గట్టు మందులు ఇవ్వడంతో త్వరగా నయమవుతున్నాయని వివిధ గ్రామాలప్రజలు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సైతం వైద్యులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని దామెర, ల్యాదెళ్ల, కోగిల్వాయి, పులుకుర్తి, ఊరుగొండలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో కూడా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇతర పీహెచ్సీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అధిక రిటర్న్స్ కోసం.. ఎస్సీఎస్ఎస్, పీపీఎఫ్, ఎస్ఎస్వై
బండరాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య