RR vs MI : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(87) ఫామ్లోకి వచ్చాడు. మునపటి యశస్వీని తలపిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, రాజస్థాన్ లక్ష్యాన్ని కరిగిస్తోంది. మరో ఎండ్లో కెప్టెన్ సంజూ శాంసన్(24) సిక్సర్లతో విజృంభిస్తున్నాడు. దాంతో, 15 ఓవర్లకు సంజూ సేన రన్స్ కొట్టింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 29 పరుగులు కావాలి.
ముంబై నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు ధనాధన్ ఆడారు. బుమ్రా మినహా అందర్నీ ఉతికేస్తూ స్కోర్ బోర్డును ఉరికించారు. ఈ సీజన్లో విఫలమవుతున్న యశస్వీ ఫామ్ అందుకోగా.. బట్లర్ బాదేశాడు. పవర్ ప్లేలో తొలిసారి వీళ్లు 50పైగా రన్స్ జోడించారు.
A determined half-century from Yashasvi Jaiswal 👏👏
💯 up for @rajasthanroyals in the chase!
Follow the Match ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/use1FO5LN1
— IndianPremierLeague (@IPL) April 22, 2024
అయితే.. స్ట్రాటజిక్ టైమ్లో వర్షం పడడంతో అంపైర్లు కాసేపు మ్యాచ్ను నిలిపివేశారు. అప్పటికి రాజస్థాన్ స్కోర్ 61/0. వాన తగ్గాక 10:45కు యథావిధిగా మ్యాచ్ షురూ అయింది. ఈ జోడీని విడదీసేందుకు పాండ్యా.. పీయూష్ చావ్లాకు బంతి ఇచ్చాడు. బట్లర్ వెనుదిగాడు. ఆ తర్వాత శాంసన్ జతగా యశస్వీ మరింత దూకుడుగా ఆడాడు.