సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగింది. వివిధ జోన్లకు జాయింట్ కమిషనర్లు (జేసీ), అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను (ఏఎంసీ) నియమిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ జాయింట్ కమిషనర్గా రాజేందర్రెడ్డి, గోల్కొండకు కె.శ్రీహరి, శంషాబాద్ జోన్ జేసీగా జి.రాజు, ఖైరతాబాద్ జోన్కు వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్కు సయ్యద్ ముసాబ్ను జోనల్ జాయింట్ కమిషనర్లుగా నియమించారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా గోషామహల్ సర్కిల్కు ఉమా మహేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం శానిటేషన్ ఏఎంసీగా సమ్రీన్ నాజ్, ప్రధాన కార్యాలయం అడ్మిన్ ఏఎంసీగా శ్రేయ, గోల్కొండ జోన్కు స్వర్ణలత, చార్మినార్కు రజని, చాంద్రాయణగుట్టకు మహేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ జోన్కు వసంతను నియమించారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ విధుల్లో చేరి నివేదికను సమర్పించాలని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.