బస్షెల్టర్ల ఏర్పాటు టెండర్ ప్రక్రియకు నిర్ణయం
సాదాసీదాగా సాగిన బోర్డు సమావేశం
సికింద్రాబాద్, ఏప్రిల్ 7: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచాలన్న ప్రతిపాదనపై పాలకమండలి సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ విషయమై క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, జీహెచ్ఎంసీలో ప్రస్తుతం విధిస్తున్న పన్ను తదితర అంశాలను అధ్యయనం చేసిన అనంతరం ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన పాలకమండలి సదరు, బాధ్యతలను జాయింట్ సీఈవోకు అప్పగించింది. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ కే సోమశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీఈవో అజిత్రెడ్డి, జాయింట్ సీఈవో విజయ్కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు.
బోర్డు పాలకమండలి ఆమోదించిన ప్రతిపాదనలు