బడంగ్పేట, ఆగస్టు 18: బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని, పాపన్న జయంతిని పురస్కరించుకుని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ సంఘం నాయకులు, కల్లుగీత కార్మికులను ఈ సందర్భంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలను సమ దృష్టితో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్థులకు సైతం కోకాపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. అదే విధంగా రైతన్నల లాగే గౌడన్నలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. ఎక్కడికో వెళ్లి గీయకుండా గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో చెరువు కట్టల మీదనే ఈత చెట్లు పెట్టినట్లు తెలిపారు. వాటిని కాపాడుకునే బాధ్యత సొసైటీలకే ఉన్నదన్నారు. నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునే వారు నేడు నగరం నడిబొడ్డున నీరా కేఫ్లు పెట్టి విక్రయించుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
– మన్సూరాబాద్, ఆగస్టు 18
– ఎర్రగడ్డ, ఆగస్టు 18
– కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 18
– నేరేడ్మెట్, ఆగస్టు 18
– జీడిమెట్ల, ఆగస్టు 18
– ఎల్బీనగర్, ఆగస్టు 18
కిస్మత్పూర్లోని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ నివాసం వద్ద స్వామి గౌడ్తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు