సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ
పీర్జాదిగూడ, మే 25: పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గ్రామాలు, పట్టణాలను సీఎం కేసీఆర్ పురపాలక, నగర పాలక సంస్థలుగా మార్చడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.