బన్సీలాల్పేట్, నవంబర్ 6 : నేను మీ వాడిని.. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్క రిస్తా.. హ్యాట్రిక్ విజయం అందించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని పద్మారావునగర్, ఈశ్వరమ్మ బస్తీ, నాగదేవత ఆలయం, హమాలిబస్తీ, చిదానందం కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ‘మా అభిమాన శీనన్నా మీదే గెలుపు అన్నా’ అంటూ ఆయనకు విజయతిలకం దిద్ది ఆశీర్వదించారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యలను తప్పకుండా పరిరిస్తామని ఆయన తెలిపారు. హమాలిబస్తీ కమ్యూనిటీ హాలు వద్ద స్థానికులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని అన్నారు. ఎన్నికల తరువాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని, చెప్పిన విధంగా హమాలీబస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మా ణం చేపడతామని ప్రకటించారు. బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామన్నారు.
మెనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గ్యాస్ సిలిండర్ను రూ.400 వందలకే అందిస్తామని, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ, ఆడపిల్ల పెండ్లికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 15 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. అర్హులైన వారికి దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ప్రచారంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జీ జీ.పవన్కుమార్ గౌడ్, ఏసూరి మహేశ్వరరావు, కే.లక్ష్మిపతి, ఏనుగు పుశ్వంత్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి ఎం.మహేందర్, ఆంబులెన్స్ సురేశ్, సుధాకర్రెడ్డి, యాదగిరి యాదవ్, రాజు, శ్రీనివాస్, హరిచారి, నాగలక్ష్మి, శోభారాణి, లావణ్య, అమృత, లక్ష్మి, అనిత, సునీత, హమాలిబస్తీ నాయకులు సుభాశ్, యాదగిరి, కుశాల్, శ్యామ్, రాందాస్, సత్యనారాయణ, సంపత్, దుర్గా, కౌసల్య, సందీప్, రవికుమార్ పాల్గొన్నారు.
శీనన్నకు విద్యార్థుల ఘనస్వాగతం
పాదయాత్రకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పద్మారావునగర్లోని శ్రీసాయివిజ్ఞాన భారతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కళాశాల కరస్పాండెంట్ ఎ.సాయిబాబా మంత్రికి శాలువాతో సన్మానించారు.
అపార్ట్మెంట్ల నుంచే ఆశీర్వాదం..
పాదయాత్రకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పద్మారావునగర్లోని పలు అపార్ట్మెంట్ల్లో నివసించే ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ కాలనీలలో అనేక సమస్యలను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్కే స్వచ్ఛందంగా మద్దతు ఇస్తామని వారు అన్నారు. అపార్ట్మెంట్ వాసులు ఎలాంటి సమస్యలు ఉన్నా తన వద్దకు నేరుగా వచ్చి చెప్పాలని, వెంటనే పరిష్కరిస్తానని మంత్రి వారితో అన్నారు. సప్తగిరి అపార్ట్మెంట్లో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్, ఇతర సభ్యులు మంత్రిని సన్మానించారు.
అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటా : మంత్రి
నియోజకవర్గంలోని అపార్ట్మెంట్లు, కాలనీల్లో నివసించేవారి సమస్యలను పరిష్కరిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూబోయిగూడ ఎంఎన్కే విట్టల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్లో పరిసరాలలోని పలు అపార్ట్మెంట్లు, కాలనీ వాసులతో ‘ఫేస్ టు ఫేస్ విత్ తలసాని’ పేరుతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తా వించిన సమస్యలను ఆయన సావదానంగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని, అన్ని ప్రభుత్వ విభాగాల ఆధికారులతో కలసి బోయిగూడలో పర్యటిస్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. మెట్రోరైల్ కోసం రోడ్డు విస్తరణ, ఆటోగ్యాస్ స్టేషన్ ఏర్పాటు సమస్యల పరిషారానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జీ జీ.పవన్కుమార్ గౌడ్, ఏసూరి మహేశ్వర్రావు, కే.లక్ష్మిపతి, ఏనుగు పుశ్వంత్ రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, లంబుశ్రీను, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్రాజు, కార్యదర్శి ఎం.మహేందర్, ఎంఎన్కే విట్టల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ అధ్యక్షుడు డాక్టర్ జి.హనుమాండ్లు, కార్యదర్శి ఉమాశంకర్, న్యూబోయిగూడ రెసిడెంట్స్ అసోసియేశన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్గౌడ్, ప్రభావతి, సాయినాథ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకురాలికి మంత్రి పరామర్శ
అమీర్పేట్ : అమీర్పేట్ డివిజన్లోని బాపునగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రాణిబాయి కుమారుడు దీపక్(36) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వారి నివాసానికి వెళ్లి రాణిబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీపక్ పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళిలర్పించారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు, అశోక్ యాదవ్, హరీసింగ్ తదితరులున్నారు.