మాదాపూర్, మార్చి 29: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల నాయకులు నివ్వెరపోతున్నారని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి చెప్పారు. స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ ఆదిత్యానగర్లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజన్ భవిష్యత్ తరాలకు బలమైన చేయూత అని అన్నారు. శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ. 8500 కోట్ల నిధులను తీసుకువచ్చిన ఘనత విప్ గాంధీకే దక్కుతుందన్నారు. హైదారాబాద్ నగరం అత్యంత సేఫెస్ట్ సిటీ అని, దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో ఒక్క హైదరాబాద్లోనే 65 శాతం ఉన్నట్లు తెలిపారు.
హ్యాట్రిక్ విజయమే లక్ష్యం..
మాదాపూర్ డివిజన్లో రూ. 322.92 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేసినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బస్తీలో రోడ్లు, డ్రైనేజీలకు రూ. 221.94 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అంతా ట్రయల్ మాత్రమేనని మున్ముందు తెలంగాణ ఎంతో గొప్పగా అవతరించనుందని విప్ గాంధీ చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి హ్యట్రిక్ గెలుపును కట్టుబెట్టాలని ఆయన కోరారు. రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. మాదాపూర్ డివిజన్లో మొత్తం 70 వేల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 30,490 మంది ఆడపడుచులు, 39,386 మంది పురుషులు ఉన్నారని, ప్రతి ఒకరికి ఓటు హక్కును కల్పిస్తామని అన్నారు.