హైదరాబాద్: నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.4 లక్షల నగదుతోపాటు 15 కేజీల వెండి, 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్ను కూడా తమతో తీసుకెల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీం సహాయంతో బంగారం దుకాణాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.