RGIA | హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డు పొడవునా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. ఈ నిబంధనను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డుపై ఆటోమేటిక్ స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వాహనదారుడు బాధ్యాతయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోని ఈ వేగ పరిమితిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు.