కాచిగూడ, జనవరి 11 : కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఎమ్మెల్యే వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..అంబర్పేట నియోజకవర్గంలోని ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, మరిన్ని మౌలిక వసతులను కల్పిస్తే 4 వేల మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ విద్య దూరమవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టి అందరి మనసులను దోచుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హిమాయత్నగర్ ఎం. విజయలక్ష్మి, దిడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్ రామచంద్రరాజు, మధుసూదన్రెడ్డి, అనిల్, ఎర్ర భీష్మాదేవ్, హెడ్మాస్టర్ సుకన్య, బద్దుల ఓం ప్రకాశ్యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, బి. కృష్ణాగౌడ్, విజితారెడ్డి, మహేశ్కుమార్, బబ్లూసింగ్, అంటోని, మన్నె శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ హబ్గా అంబర్పేట..
గోల్నాక : అంబర్పేట నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన 36వ జాతీయ షోటోఖాన్ కరాటే పోటీల్లో బెస్ట్ టీం అవార్డు గెలుచుకున్న అం బర్పేట మున్సిపల్ మైదానంలో శిక్షణ పొందిన కరాటే క్రీడాకారులకు బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ట్రోఫీని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు వారికి ఆసక్తి గల క్రీడల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంబర్పేట మున్సిపల్ మైదానంపై పత్రేక శ్రద్ధ తీసుకొని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కరాటే శిక్షకుడు రాఘవతో పాటు విజేతలు శివకిరీటి, శ్రీనాథ్, భరత్, వేద, రోహిత్ తదితరులు ఉన్నారు.