Universities | రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రొఫెసర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరూ కూడా రూ.1000 కోట్లు ఇవ్వలేదు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం (చాకలి ఐలమ్మ యూనివర్సిటీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కూడా ఇచ్చామన్న రూ.400 కోట్లు ఇవ్వలేదు. ఇవన్నీ బూటకపు మాటలన్నారు.
అదనంగా ప్రభుత్వం చేస్తున్న పన్నాగమేంటంటే.. ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. జేఎన్టీయూలో రూ.600 కోట్ల ఫండ్ ఉంది. ఆ డబ్బును కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే వాళ్లివ్వడం కాదు..తీసుకోవడమే ఎక్కువున్నది.. కాబట్టి మీరు భ్రమలల్లోకి పోకండి. పోయి ఉస్మానియాకు వెయ్యికోట్లు ఇచ్చిర్రట. బిల్డింగ్స్ వస్తయట.. అని అనుకోకండని సూచించారు.
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు