అఖండ భారతావనికి రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు నిండుకున్నాయి. ఈ వేడుకను ప్రతి యేట జనవరి 26వ తేదీన యావత్ భారతం కనుల పండువగా జరుపుకుంటున్నది. ఈ శుక్రవారం 26వ తేదీతో స్వతంత్ర భారతానికి రాజ్యాంగబద్ధత కల్గి నిండాడైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నది. హైదరాబాద్ మహా నగరంలో గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రైవేట్ కార్యాలయాలన్నీ రిపబ్లిక్ డే వేడుకల్లో తలమునకలయ్యాయి.
ప్రతి వీధి, వాడ, గల్లీలు, బస్తీలు, ఆటో స్టాండ్లు, దుకాణాలు, ప్రతి కూడలి, జన సంచారం గల ప్రతి ప్రాంతం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి విద్యా సంస్థ ఈ సందర్భంగా ఒక ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. భారత్ మాతాకీ జై అంటూ యువత, విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నగరమంతటా జాతీయతా భావం నిండుకొని, నగరవాసి ఒకేతాటిపైకి వచ్చినట్టు అయ్యింది.