రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి వర్షం పడింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మి.మీలు వర్షపాతం నమోదైంది.