Hyderabad | హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరిగి, చలి తీవ్రత తగ్గింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.3డిగ్రీలు, గాలిలో తేమ 58శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.