సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి. జియాగూడలో అత్యధికంగా 1.2 సెం.మీలు, సర్దార్మహల్ 1.0 సెం.మీ, కందికల్గేట్లో 8 మిల్లీమీటర్లు, దూద్బౌలిలో 7.3 మి.మీలు, కిషన్బాగ్లో 6.5 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గరిష్ఠం 30.7, కనిష్ఠం 23.1 డిగ్రీలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైనట్లు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.