హైదరాబాద్ : గత వారం పది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో.. జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కాలాపత్తార్, జూపార్క్, ఫలక్నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగర శివార్లలోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లిలో, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి.