చింతలమానేపల్లి, జూలై 22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేశ్ దంపతుల పెద్ద కొడుకు లోకేశ్ (14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం లోకే శ్ ఇంట్లో కరెంట్ స్విచ్బోర్డు వద్ద బ్యాటరీలతో సరదాగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఒ కసారిగా పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలగా లోకేశ్ ముఖం, చేతులు పగిలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని సిర్పూర్-టీ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.