దుండిగల్, ఫిబ్రవరి 5 : నిజాంపేట్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్, బాచుపల్లి జయదీపిక ఎస్టేట్స్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న వర్షపునీటి కాలువ, ప్రధాన గేట్ల వద్ద గ్రిల్స్, అదే విధంగా పూజిత ఎన్క్లేవ్లో రూ.65లక్షలతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పైపులైన్ పనులకు నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, అదే విధంగా నిధుల కొరత లేకుండా బాచుపల్లి చౌరస్తాలో ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు పనులు, లింక్ రోడ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపడుతున్నామని, అవి పూర్తయితే స్థానికంగా ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలను నెరవేర్చుకుంటూ భవిష్యత్ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
సూరారం డివిజన్ పరిధి, న్యూ శివాలయనగర్లో శ్రీముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, శివాలయనగర్ అధ్యక్షుడు శంకర్నారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరేశ్, గోపాల్, ఆంజనేయులు, మూర్తి, కిరణ్, చౌడయ్య, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం, నల్లగుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం(చిన్నశ్రీశైలం)లో ఆదివారం నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ శివ మహాపడిపూజలో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, యువజన విభాగం అధ్యక్షుడు సోమేశ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.